పునరావాసం కల్పించండి

 ని గ్రామ 

 (జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గని గ్రామ ప్రజలు పునరావాసం కల్పించాలని నంద్యాల జిల్లా ఆర్డీవో గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గని గ్రామంలో భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ గని గ్రామంలోని మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయామని,2014 సంవత్సరంలో గని గ్రామంలో ఏర్పడిన మెగా సోలార్ పవర్ ప్రాజెక్టులో 390మంది రైతుల భూములు కోల్పోవడం జరిగిందనీ,అందుకు నష్టపరిహారంగా 13-07-2018 తారీకున 62 మంది రైతులకు మాత్రమే పునరావాసం ఇవ్వడం జరిగిందనీ,


భూములు కోల్పోయిన సోలార్ బాధితులకు గత ఆరు  సంవత్సరాల నుండి పునరావాసం కల్పించలేదనీ,గని సోలార్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పునరావాసం కల్పించి న్యాయం చేయాలని నంద్యాల ఆర్డీవో గారికి వినతిపత్రం అందజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: