పింఛన్లకు మంగళం పాడుతున్న రాష్ట్రప్రభుత్వం
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు మండలంలోనీ పార్టీ కార్యాలయంలో సిపిఐ(యం ఎల్) జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో వున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులకు,వింతంతులకు, వికలాంగులకు, మరియు అవ్వాతాతలకు పింఛన్లు పెంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం,ఇప్పుడు అడ్డగోలుగా ఆంక్షలు విధిస్తూ పింఛన్లకు మంగళం పాడుతున్నారని, పేదల నోటికాడి అన్నం ముద్దను లగేసుకుంటూన్నారని, సిపిఐ (యంయల్) ఆర్ ఐ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ మండిపడ్డారు. ఒక్కచాన్సు ఇవ్వండి మీ బ్రతుకులు మార్చడానికి నేను వున్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంక్షలను తీసుకువచ్చి మూడో కంటికి కూడా కనపడని ఆంక్షలతో అవ్వా...తాతలకు వికలాంగులకు వింతంతులకు భారి కోత విధిస్తూ ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమనీ ఎద్దేవా చేశారు.జగన్ మోహన్ రెడ్డి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు విద్యుత్ మీటర్లు ఉన్నాయనే సాకు చూపుతూ 2.5 లక్షల మంది పేద ప్రజల పింఛన్లకు మంగళం పాడడం ఎంతవరకు సమంజసం అని,త్వరలో జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యం ఎల్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: