బాబ్రీ మసీదు కూల్చివేత తీవ్రమైన న్యాయ ఉల్లంఘన
ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ఘోరమైన న్యాయ ఉల్లంఘనని, లౌకికవాదం, ప్రజాస్వామ్యం పై దాడి అని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. దీనిని లౌకిక, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని ఆయన కోరారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ లౌకిక, ప్రజాస్వామ్య విలువల పునాదులపై నిర్మించబడుతున్న దేశాన్ని హైజాక్ చేసి మతోన్మాదం, విద్వేషం పునాదులపై నిర్మించాలని సంఘ్ పరివార్ కలలు కంటోందని, అసత్యాలు, కట్టుకథలు ఆధారం చేసుకొని విషప్రచారం చేసి బాబ్రీ మసీదును కూల్చి వేశారని విమర్శించారు. అధికారం కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని బిజెపి ఆర్ఎస్ఎస్ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని అన్నారు. దేశంలో సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లౌకికవాదాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. దేశ ప్రజలు ఏమైనా బిజెపికి అవసరం లేదని, అధికారం సంపాదించడమే దాని అంతిమ లక్ష్యంగా ఉందన్నారు. అందుకోసం ఎన్ని కుటిల ప్రయత్నాలు చేయడానికైనా సంఘ్ పరివార్ సిద్ధమేనని, దీనిని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో కార్పొరేట్, మతోన్మాద శక్తుల మైత్రి బంధము కొనసాగుతున్నదని, ప్రజా సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడున్నారని అన్నారు. పేదలని దోచి పెద్దలకు పెట్టే విధానాలు అనుసరిస్తున్నారు. దేశంలో అనేక జాతుల, మతాల, కులాల, భాషల ప్రజలు కలిసి మెలిసి జీవిస్తుంటే ఆర్ఎస్ఎస్, బిజెపి ప్రజల మధ్య చిచ్చు పెట్టి, దేశాన్ని విచ్ఛిన్నం చేయ చూస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి నిరోధక పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. సంఘ్ పరివార్ ప్రోద్బలంతో మైనారిటీలపై, దళితులపై, మహిళలపై, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను, బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల్ని ఖండించాలని కోరారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకోవాల్సిన మన మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ లతీఫ్,అబ్దుల్ సత్తార్, నగర నాయకులు మహమ్మద్ కలీం, గఫార్ ఖాన్, మహ్మద్ రఫీ, మొహమ్మద్ సాజిద్, షేర్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
బాబ్రీ మసీదు కూల్చివేత తీవ్రమైన న్యాయ ఉల్లంఘన -- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: