శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో
ఘనంగా విగ్రహ పున:ప్రతిష్టాపన
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)పాతబస్తీ దూద్ బౌలిలోని శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం విగ్రహ పున:ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. వేద బ్రాహ్మణులు భరద్వాజ శర్మ బృందంతో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు.తమిళనాడులోని మహబలేశ్వరంలో తయారైన అమ్మవారి విగ్రహాన్ని ఉదయం 10 గంటలకు శ్రీ మాత నిర్మాణానంద యోగ భారతి అమ్మవారి కరకములొచ్చే పైనీరు ముత్యాలయ దేవాలయములో విగ్రహ పున ప్రతిష్టాపన నిర్వహించిన అనంతరం ఆమె ప్రత్యేక ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.
అనంతరం ప్రాతకాలపు పూజలు, హోమాలు, గరిక పూజలు, పీఠపూజలు, గర్తన్యాసం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, అష్టబలి, మహాబలి, చండిహోమం నిర్వహించారు, అనంతరం అన్నప్రసాద వితరణ జరుగిం ది . ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న భక్తులు పాల్గొన్నారు. పురాణభూమి కార్పొరేటర్ సున్నం రాజమోహన్ అభిషేక్ రాజ్ సెక్స్ ముఖేష్ భాయ్ విజయ్ కుమార్ అగర్వాల్, ఆలయ నిర్వాహకులు కట్ట వెంకటాచలం ముదిరాజ్, దోరేటి ఆనంద్ గుప్త, వలబోజు శ్రీనివాస చారి. కట్ట అనిల్ కుమార్ అరవింద్ కుమార్ శశిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
శ్రీశ్రీశ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంలో ఘనంగా,, విగ్రహ పున:ప్రతిష్టాపన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: