కొత్త కమిటీతో కాంగ్రెస్ లో మరో చిచ్చు
ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో సతమతం
అసలే సమస్యలతో సతమతవుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త కమిటీల అంశం మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.. టీ కప్పులో తుఫానులా మారింది. అధిష్ఠానం ప్రకటించిన కొత్త కమిటీలతో కల్లొలం మొదలైంది. అసలే.. ఉన్న నాయకులు పక్క పార్టీల్లోకి జంపింగులు చేస్తుంటే.. ఉన్న నాయకులకు సముచిత స్థానం కల్పించట్లేదంటూ అసంతృప్తి స్వరం పెరిగిపోతోంది. కమిటిల్లో పేర్లున్నా.. వాళ్లకున్న సీనియార్టీకి సముచిత స్థానం దక్కలేదని కొందరు నాయకులు.. అసలు కమిటీల్లో స్థానమే దక్కలేదని మరికొందరు నేతలు అలకపాన్పులెక్కారు. ముందు నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులకు కమిటీల కూర్పులో అన్యాయం జరిగిందంటూ.. సీనియర్ నాయకులు బాహటంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఇన్ని రోజుల నుంచి ఉన్నా.. గుర్తింపునిచ్చే పదవులు మాత్రం కొత్తగా వచ్చిన వాళ్లకు ఇచ్చారంటూ.. పాత నాయకులు పంచాయితీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే.. కమిటీల కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వరంగల్ జిల్లా నాయకురాలు కొండా సురేఖ తనకు కేటాయించిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్కు ఆదివారమే రాజీనామా చేశారు. ఇక ఈరోజు.. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు కూడా పదవులిచ్చి.. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి నిజాయితీ గల నాయకులకు మాత్రం అన్యాయం చేశారంటూ.. అక్కస్సు వెల్లగక్కారు.
పార్టీలో 24 మంది ఉపాధ్యాక్షులు, 84 మందికి ప్రధాన కార్యదర్శులు, 40 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, 18 మంది పొలిటికల్ ఎఫైర్స కమిటీ, 26 జిల్లాలకు అధ్యక్షులతో కొత్త కమిటీలను అధిష్ఠానం ప్రకటించింది. ఈ జంబో కమిటీపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని మాత్రం 32 నుంచి 18 మందికి కుదించటంలో అసలు లొల్లి షురూ అయ్యింది. అయితే ఇందులో పాతవారినే డీసీసీలుగా కొనసాగించటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత దక్కలేదు. ఓయూ జేఏసీ నేతల్లో కొందరికీ ఈ కమిటీల్లో అవకాశం కల్పించటంతో.. సీనియర్లు ముఖాలు మాడ్చారు. మరోవైపు అజారుద్దీన్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం కల్పించకపోవటంపై పలువురు సీనియర్లు అలిగారు. ఇన్ని రోజుల నుంచి ఉన్నందుకు తమకు పదవులు ఇవ్వకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు సముచిత స్థానం కల్పించకపోవటం
పీసీసీల నియామకంపై పలువురు సీనియర్ నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో భేటీ అయ్యారు. అధిష్ఠానం ప్రకటించిన కమిటీల్లో స్థానం దక్కని నేతలు సమావేశమయ్యారు. కాగా.. కమిటీల కూర్పు విషయంలో తనకు సమాచారమే లేదంటూ.. తన అసంతృప్తి గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు భట్టి. "కమిటీల్లో ఎవరెవరుండాలి.. ఏఏ స్థానానికి ఏ సామాజిక వర్గం నుంచి తీసుకోవాలి అనే అంశాలపై.. జాబితా రూపొందించటంలో పీసీసీ, సీఎల్పీలను సంప్రదించి కసరత్తు చేస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. జిల్లాల వారిగా ఎవరెవరిని తీసుకుంటారో చెప్పలేదు. నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో నాకు తెలియదు. జిల్లాలో పీసీసీ, సీఎల్పీలది సమాన బాధ్యత అన్నారు. కానీ.. ఇప్పుడు నాకు ఎందుకో సమాచారం ఇవ్వలేదు. కమిటీల్లో చోటు దక్కని వారంత కొంత అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేతలకు కూడా అవకాశం రాలేదని చెప్పారు. కమిటీల్లో సీనియర్ల పేర్లు మిస్సయ్యాయని.. సమాజిక సమతుల్యత లేదని కొందరు చెప్పారు. అన్నింటినీ క్రోడీకరించి.. పార్టీ దృష్టికి తీసుకెళ్తా." అని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇలా.. పార్టీలో అసంతృప్తి వర్గాలు, గ్రూపు రాజకీయాలతో తెలంగాణ కాంగ్రెస్ హస్తవ్యస్తమవుతూనే ఉంది. గత పదేళ్లతో అసంతృప్తులను బుజ్జగించే పనితోనే పార్టీ నాయకత్వం కిందా మీద పడుతోంది. పార్టీని కాపాడుకోవటంలో తడబడుతూనే ఉంది. ఇక ఇలాంటి సందర్భంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం.. ప్రజల్లోకి పోయే కార్యాచరణకు చోటే లేకుండా పోయింది. దీంతో.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. దీనికి తోడు ఈ కొత్త కమిటీల పంచాయితీతో.. పార్టీలో మరింత అనిశ్చితి ఏర్పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Home
Unlabelled
కొత్త కమిటీతో కాంగ్రెస్ లో మరో చిచ్చు,,,, ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో సతమతం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: