పాదయాత్ర చేపట్టిన 

నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నంద్యాల పార్లమెంటులో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర చేపట్టినట్లు నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ తెలిపారు.పాదయాత్రలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి గ్రామాలలోని ప్రజల సమస్యలు, రైతన్నల సమస్యలను విద్య ఉపాధి నిరుద్యోగ సమస్యలను, కార్మిక కర్షక వర్గాల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు.


విద్యార్థి సంఘాలతో,విద్యార్థులు, నిరుద్యోగులు,మేధావులు, ఉద్యోగస్తులు వివిధ ప్రజా సంఘాల మద్దతు, ఆశీర్వాదంతో గ్రామాల లోని ప్రజల సమస్యలను తెలుసుకొని,పరిష్కార మార్గం దిశగా గ్రామాలలోని ప్రజలు అభివృద్ధి బాటలో ప్రయాణించాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పాదయాత్ర సాగిస్తామని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: