ఓమ్మిక్రాన్ వేరియంట్ బిఎఫ్ 7 తో అప్రమత్తంగా ఉండండి

గడివేముల మండల ప్రభుత్వ వైద్యాధికారిని జబీన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ప్రజలందరూ ఓమిక్రాన్ వేరియంట్ బిఎఫ్ 7 తో అప్రమత్తంగా ఉండాలని గడివేముల మండల ప్రభుత్వ వైద్యాధికారిని జబీన్ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో గుజరాత్ రాష్ట్రంలో రెండు, ఒడిస్సా రాష్ట్రంలో రెండు కేసులు నమోదుకావడంతో  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఓమిక్రమ్ వేరియంట్ బిఎఫ్ సెవెన్ తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన నేపథ్యంలో మండలంలో ప్రభుత్వ వైద్యశాలలో కరోనా టెస్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు.బిఎఫ్ సెవెన్ వేరియంట్ లక్షణాలు ముక్కులలో నీరు కరడం, గొంతు నొప్పి,జ్వరం,దగ్గు అలసట,వాంతులు,


విరోచనాలు,కండరాల నొప్పులు వంటి లక్షణాలు కలిగి ఉంటుందని, దీర్ఘకాలిక వైద్య సమస్యలు,ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నవారు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఉచితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, చేతులను సబ్బుతో కడుక్కోవడం,శానిటైజర్లు వాడడం,మాస్కులు ధరించడం,సామాజిక దూరం పాటించడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఓమికాన్ వేరియంట్ బిఎఫ్ 7 బారిన పడకుండా ఉంటారని గడివేముల మండల ప్రభుత్వ వైద్యాధికారిని జబిన్ తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: