అయ్యప్ప స్వామి మహా పడిపూజలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రత్యేక పూజల నిర్వహణ

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడిపల్లి గ్రామం వార్డ్ నెంబర్ 12 లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మామిడిపల్లి శ్రీశ్రీశ్రీ బాల మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం లో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ. యాతం పవన్ యాదవ్ , కన్నె స్వామి కార్పొరేటర్ శివ కుమార్,  మహేశ్వర నియోజకవర్గ ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, గురుస్వాములు మద్ది జగదీశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: