వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి

రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశాలకు హాజరైన బిజెపి నాయకులు.. మురళీధర్ రావు..రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ 

(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)

వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయమే లక్ష్యంగా ప్రతి నేత కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. బుధవారం నాడు బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి అధ్యక్షతన ఇబ్రహీంపట్నం మున్సిపల్ బాలాజీ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ బిజెపి ఇంచార్జి మురళీధర్ రావుతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.  వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటి నుంచే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ నేతలు కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పదాధికారుల, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: