నిర్ణీత సమయం దాటాక వ్యాపారకలాపాలు

అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ సీ.ఐ.నరేష్

అరెస్ట్ అయిన వ్యాపారులకు మూడు రోజుల జైలు శిక్ష..జరిమాన విధించిన కోర్టు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

నిర్ణీత సమయం దాటి అర్థరాత్రి వరకు వ్యాపారకలాపాలు నిర్వహిస్తున్న పలువుర్ని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్పెక్టర్ నరేష్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా వారిని మూడు రోజుల జైలు శిక్షతోపాటు కోర్టు జరిమాన విధించింది. వివరాలలోకి వెళ్లితే...పాతబస్తీలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనల కు విరుద్ధంగా నిర్ణీత సమయం తరువాత హోటల్లలో వ్యాపార కలాపాలు నడుపుతున్న వారిపై సీ.ఐ.నరేష్ కేసు నమోదు చేసి బుధవారంనాడు కోర్టు ముందు ప్రవేశ పెట్టగా మొదటి ప్రత్యేక మెట్రోపోలిటన్ న్యాయమూర్తి  విచారించి  1. సాబెర్ అలీ , వ, 23 స, కేజీఎన్ టిఫిన్ సెంటర్ , పంచ్ మొహాల్ల కు మూడు రోజుల జైలు శిక్ష మరియు Rs 1050/ జరిమానా విధించినారు. ఈ సందర్భంగా సీఐ నరేష్ మాట్లాడుతూ..అందరు హోటల్, ఇతర వ్యాపార సముదాయల వారికి విజ్ఞప్తి దయచేసి నిర్ణీత  సమయంలోగ మీ వ్యాపార కార్యక్రమాలు ముగించుకోవాలి, గడువు సమయం తరువాత షాపులు, హోటల్లు, పాన్ డబ్బాలు, ఏ ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగించవద్దని కోరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: