నిర్ణీత సమయంలోపే వ్యాపారాలు చేసుకోవాలి

ఫలక్ నూమా సీ.ఐ.దేవేందర్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

నిర్ణీత సమయంలోపే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని వ్యాపార వర్గాలను ఉద్దేశించి ఫలక్ నూమా సీ.ఐ. దేవేందర్ అన్నారు. ప్రజలు, వ్యాపారస్తులతో ఫ్రెండ్లీ పోలీస్ గా తాము వ్యవహరిస్తున్నామన్నారు. కానీ నిబంధనల ఉల్లంఘనలలను ఏ మాత్రం సహించబోమని ఆయన స్పష్టంచేశారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం వ్యాపారాలు నిర్ణీత సమయపాలనలోనే కొనసాగుతున్నాయని సీఐ దేవేంద్ వెల్లడించారు. ఇదే పద్దతిని వ్యాపారులందరూ మున్ముందు కూడా కొనసాగించాలని ఆయన సూచించారు. ఎక్కడైనా నిర్ణీత సమయాన్ని దాటి వ్యాపారాలు  చేసినట్లు  తెలిస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. ఈ విషయాన్ని వ్యాపారులందరూ పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన కోరారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: