ప్రభుత్వ కార్యాలయాల సైన్ బోర్డులపై...కొత్త జిల్లాపేరు ఎక్కడా
పాత జిల్లా పేరుతోనే బోర్డులు
గడివేముల మండల అధికారుల నిర్లక్ష్యానికి...మచ్చుతునకలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారుల పనితీరుకు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. వివరాలలోకి వెళ్తే స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం,తహసిల్దార్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాల, భావితరానికి విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాల లకు ఉన్నతాధికారులు, అధికారులు, ఆఫీసులకు ఉద్యోగరీత్యా వచ్చి విధులు నిర్వహించి సాయంకాలం వెళుతుంటారు.కానీ ఉద్యోగాలకు వచ్చే ఉన్నతాధికారులకు, అధికారులకు మాత్రం వారు పనిచేస్తున్న ఆఫీసులకు మొదట కనిపించే కార్యాలయాల పై ఉన్న సైన్ బోర్డులలో కర్నూలు జిల్లా పేరు ను మాత్రం చూసి చూడనట్లు వెళ్తుంటారు.
ప్రభుత్వ అధికారులు పనిచేయు కార్యాలయాల పై ఉన్న బోర్డులకు మాత్రం నేటికీ కర్నూలు జిల్లా పేరునే కొనసాగిస్తున్నారు. గడివేముల మండలం నంద్యాల జిల్లా లోకి మారి సంవత్సర కాలమైన నేటికి గడివేముల మండలంలో ప్రభుత్వ కార్యాలయాల పై ఉన్న సైన్ బోర్డులపై మాత్రం అధికారులు చొరవ చూపకపోవడంతో నేటికీ కర్నూలు జిల్లా పేరు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు ప్రతినిత్యం కార్యాలయాలకు విధులు నిర్వహించడానికి వస్తు కార్యాలయాలపై ఉన్న సైన్ బోర్డులను చూస్తూ కూడా వాటిపై ఉన్న కర్నూలు జిల్లా పేరును తొలగించి నంద్యాల జిల్లా పేరును మార్చలేనంత అధికారులు పనులు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ గ్రామాల
నుండి వారి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు నేటికీ గడివేముల మండలం కర్నూలు జిల్లాలో ఉందా లేక నంద్యాల జిల్లాలో ప్రభుత్వఅధికారులు విధులు నిర్వహిస్తున్నారా అ
ని చర్చించుకుంటున్నారు.
Post A Comment:
0 comments: