ఎం.టి.యస్ పై ఎం.పి.ఈ.ఓ లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి... 

వినతి పత్రం అందజేత

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం పరిధిలోని గడివేముల మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్న 1611 మంది ఎం.పి.ఈ.ఓ లు టి.టి.డి పాలక మండలి సభ్యులు,పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వివరాలలోకి వెళ్తే బహుళ విస్తరణ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతి లో డిస్ట్రీక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నుకోబడి గత 9 సంవత్సరాల నుండి రైతులకు మరియు వ్యవసాయ శాఖకు మధ్య వారధిగా ఉంటు వివిధ పథకాలు రైతులకు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఉన్నటివంటి రైతూ భరోసా కేంద్రాలకు ఇంఛార్జి లు గా కుడా విధులు నిర్వహిస్తున్నా మని తెలిపారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మినిమం టైం స్కేల్ తప్పకుండా కల్పిస్తామని, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గడివేముల మండల వ్యవసాయశాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసులు, గడివేముల జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, గడివేముల బహుళ విస్తరణ అధికారులు రామకృష్ణ,రేవతి, మంజుల,శ్యామల,మాధవిలత, కవిత బాయి తదతరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: