మునుగోడు ఓటర్లకు మంత్రి సబితా రెడ్డి ధన్యవాదాలు

సబితా ఇంద్రారెడ్డి ఇంచార్జ్ గా ఉన్న పసునూరులో టిఆర్ఎస్ కు భారీ మెజార్టీ

సంబరాలు చేసుకున్న పసునూరు టిఆర్ఎస్ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్- రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంచార్జ్ గా ఉన్న పసునూరు ఎంపీటీసీ స్థానంతో పాటు  టిఆర్ ఎస్ పార్టీకి భారీ మెజార్టీ లభించింది. 332 ఓట్ల మెజార్టీ తో టి ఆర్ ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఓటర్లకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో  టి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంభారాలు జరుపుకున్నారు. బీజేపీ సర్పంచ్, ఎంపీటీసీ లు ఉన్న పసునూరు లో మంత్రి ప్రచారంతో టిఆర్ ఎస్ కు భారీ మెజార్టీ వచ్చింది

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: