డా.ప్రేమ్ రాజ్ యాదవ్ పరామర్శించిన దత్తాత్రేయ.. బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)
బిజెపి సీనియర్ నాయకులు డా.ప్రేమ్ రాజ్ యాదవ్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. బిజెపి సీనియర్ నాయకులు బుక్క వేణుగోపాల్ పరామర్శించారు. ఇటీవల డా.ప్రేమ్ రాజ్ యాదవ్ మాతృమూర్తి గంగమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డా.ప్రేమ్ రాజ్ యాదవ్ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి సీనియర్ నాయకులు బొక్క వేణుగోపాల్ పరామర్శించి ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. డా.ప్రేమ్ రాజ్ యాదవ్ కు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి పదాధికారుల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Unlabelled
డా.ప్రేమ్ రాజ్ యాదవ్ పరామర్శించిన దత్తాత్రేయ.. బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: