నిమోనియా(ఆస్తమా) పట్ల జాగ్రత్తగా ఉండండి

గడివేముల పి హెచ్ సి డాక్టర్ తేజస్విని

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

గడివేముల మండల ప్రజలకు నిమోనియా (ఆస్తమా)పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ తేజస్విని తెలిపారు. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం మరియు రాత్రి సమయాలలో కొంతమంది చిన్న పిల్లలకు మరియు వృద్ధులకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని,చల్లటి పానీయాలు తీసుకోవడం వల్ల,చల్లని ప్రదేశాలలో ఎక్కువగా తిరగడం వల్ల కొంతమంది చిన్నపిల్లలకు మరియు వృద్ధులకు ఊపిరితిత్తులకు నిమ్ము(నీరు) వస్తుందని,అలా రావడం వల్ల శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని,అలాంటి పరిస్థితుల్లో తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వచ్చి శ్వాసకోస ఇబ్బందికి తగు చికిత్స చేయించుకోవాలని,


నిమోనియా(ఆస్తమా)తో బాధపడేవారు ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల లోపల మాత్రమే ప్రయాణాలు చేసి నిమోనియా(ఆస్తమా)  బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళవలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్లాలని సూచించారు.గడివేముల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి 24 గంటలు పని చేస్తుందని,వైద్య సేవలు అందించడానికి వైద్యసిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని, ప్రజల ఆరోగ్య భద్రతే మా ప్రధమ లక్ష్యమని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: