కాల్వ శ్రీనివాసులును అరెస్ట్ చేసిన పోలీసులు

టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులుఅరెస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందు తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అనంతపురం జిల్లా టీడీపీ నేత జగ్గు కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అయితే పోలీసులు జగ్గును అరెస్ట్ చేయగా, మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో, ఆందోళన చేపట్టిన తమ పార్టీ శ్రేణులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు చెన్నే కొత్తపల్లి బయల్దేరారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులును నిలువరించిన పోలీసులు ఆయనను స్థానిక టీడీపీ ఆఫీసులో గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. 

పోలీసుల తీరును గర్హిస్తూ కనేకల్ రోడ్డుపై తన అనుచరులతో కలిసి బైఠాయించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాలువ శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని రాయదుర్గంలోని ఆయన నివాసానికి తరలించారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: