సెట్విన్ కు స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆవార్డు
సంస్థ ఎండీ వేణుగోపాల్ కు అందజేసిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సెట్విన్ సంస్థ ఆన్ లైన్ లో ఇస్తున్న ఆధునిక శిక్షణ ను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రముఖ సంస్థ స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆవార్డును సెట్విన్ సంస్థ ఎం.డీ.వేణుగోపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అదేశాల మేరకు సెట్విన్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విరివిగా కల్పిస్తున్నానందుకు స్కోచ్ సంస్థ అందజేసే ఈ అవార్డ్ ను సెట్విన్ సంస్థ సాధించుకోవడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.
Home
Unlabelled
సెట్విన్ కు స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆవార్డు ,,, సంస్థ ఎండీ వేణుగోపాల్ కు అందజేసిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: