ఆకాశదీపారాధన ఆవరోహన గ్రామోత్సవంతో...
ముగిసిన కార్తీకమాస దీపోత్సవము
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని శ్రీ దుర్గా భోగేశ్వరంలో పోలి అమావాస్య మరియు కార్తీకమాస చివరిరోజు కావటంతో భక్తులు పోటెత్తారు. శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి సన్నిధిలోని పంచామృత కోనేర్లలో భక్తులు పవిత్రస్నానము ఆచరించి స్వామివారిని దర్శించుకొని, దూపదీప, నైవేద్యములు సమర్పించి మహాన్యాస రుద్రాభిషేకములు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ. ఛైర్మెన్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: