రోడ్డు ప్రమాదం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర  దిగ్భ్రాంతి

ప్రమాదంపై అరా....కలెక్టర్,ఎస్పీ లతో మాట్లాడిన మంత్రి

క్షతగాత్రులకు మెరుగైన వైద్య అందించాలని ఆదేశం


(జానో జాగో వెబ్ న్యూస్-రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

వికారాబాద్‌ జిల్లా ధారూర్ మండలంలోని కేరెళ్లి – బాచారం వద్ద ఆటోను లారీ ఢీ కొన్న సంఘటనలో నలుగురి మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు .ప్రమాద విషయం తెలిసిన వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల,ఎస్ పి కోటిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా అధికార్లను  ఆదేశించారు. ఇదిలావుంటే పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన వ్యక్తులు ఆటో లో వెళ్తుండగా లారీ ఢీకొనడంతో  అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా,మరొకరు ఆస్పత్రిలో మృతి చెందగా పలువురు గాయపడటం బాధాకరమని అన్నారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: