మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులర్పించిన

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక ఆత్మకూరు పట్టణంలో సంగమేశ్వర సర్కిల్లో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా,మేధావిగా,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్తగా,రచయితగా కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ ధైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి వారి స్వేచ్ఛకు కృషి చేసిన మహానీయుడుపూలే గారని అతను భారతదేశంలో కుల విపక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద,అంటరాని ప్రజల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రాజేష్,వంశీ, సురేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: