గడివేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నూతన పదవి బాధ్యతలు చేపట్టిన,,

సి.ఏ.ఎస్ లు డాక్టర్ తేజస్విని, డాక్టర్ జబిన్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  సివిల్ అసిస్టెంట్ సర్జన్ లు గా డాక్టర్ తేజస్విని, డాక్టర్ జబీన్ లు బాధ్యతలు చేపట్టారు. గడివేముల మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి కర్నూలుకు బదిలీ కావడం, డాక్టర్ శ్రీమతి సృజన గారు ఉన్నత స్థాయి విద్య ను అభ్యసించడానికి తిరుపతి పీజీ  కాలేజీకి వెళ్లడంతో గడివేముల ప్రాథమిక కేంద్రంలో ఖాళీ అయిన సివిల్ సర్జన్ అసిస్టెంట్ పోస్టులలో డాక్టర్ తేజస్విని, డాక్టర్ జబీన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడివేముల మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య విషయంలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: