ఫిరాయింపుదారులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ 


ఫిరాయింపుదారులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీనే అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. చండూరులో సీఎం కేసీఆర్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తే అభద్రతాభావం, అపనమ్మకం కనిపించిందని అన్నారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు. చండూరులోనూ కేసీఆర్ పాత రికార్డునే ప్లే చేశారని విమర్శించారు. ఆరోపణలు, హామీలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడినవన్నీ అవాస్తవాలేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని మీ పార్టీలో చేర్చుకున్నారు అని ఆరోపించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ... నలుగురు హీరోలని కేసీఆర్ చెబుతున్న నేతలు పార్టీ ఫిరాయించినవారేనని వెల్లడించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో డబ్బు విషయం ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: