టిఆర్ఎస్ తోని అభివృద్ధి సాధ్యం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 21, 22 23 వ వార్డులలో రూ .75 లక్షల వ్యాయామంతో కూడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బీటీ రోడ్, సిసి రోడ్డు పనులకు మంత్రి సబితా రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిని వేగం పట్టించారని ఆమె వెల్లడించారు. అభివృద్ధికి చిహ్నం టిఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: