ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం
సర్దార్ వల్లభాయ్ పటేల్..... జయంతి వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి అధ్యక్షతన "జాతీయ ఐక్యత దినోత్సవం" మరియు ఆంధ్రుల ఉక్కుమనిషి"సర్దార్ వల్లభాయ్ పటేల్" జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ అధికారులతో, సిబ్బంది చేత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని , విద్యార్థుల చేత, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల చేత జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతిజ్ఞ చేయించి ప్రధాన రహదారులపై భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర, జిల్లా, అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు 3.k పరుగు పందెం ఎంపీడీవో విజయసింహారెడ్డి పచ్చ జెండా ఊపి పరుగు పందెంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి ఖాలిక్ భాష,ఎంఈఓ రామకృష్ణుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం దస్తగిరమ్మ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం .... సర్దార్ వల్లభాయ్ పటేల్..... జయంతి వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: