దళితుల భూములపై ఉన్న

డంపింగ్ యార్డ్ ను మార్చండి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు మునిసిపాలిటీ లో జరిగిన మునిసిపల్ సాధారణ సమావేశంలో  మునిసిపల్ వైస్ చైర్మన్  అర్షపోగు ప్రశాంతి, ఒకటో వార్డ్ కౌన్సిలర్  కాటేపోగు చిన్న రాజు, దళితుల భూములపై ఉన్న డంపింగ్ యార్డు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్దిగట్ల పొలిమేరలో ఉన్న డంపింగ్ యార్డును వేరే చోటికి బదిలీ చేయాలని అక్కడ ఉన్నది కేవలం ఏబీఏం పాలెం కు చెందిన ఎస్సీ దళిత కుటుంబాలు కొన్ని ఏళ్ళ తరబడి గనెట్ పనిచేస్తూ కూలీ నాలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని,అక్కడ ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చుకుంటూ భూమిని సాగుచేసుకొని పంటలు పండిస్తున్నారని 


అలాంటి సాగు భూములపై పట్టణంలోని మురికిని అంతా అక్కడ వదలడం వలన దళిత కుటుంబాలు సాగు చేసుకొంటున్న భూములు కోల్పోతారని, దీని వలన దళితులు పూర్తిగా నష్ట పోతారని జీవనాధారం పూర్తిగా కోల్పోతారని, అందువలన దళితుల భూములపై నిర్మించిన డంపింగ్ యార్డు ను వేరే చోటికి ఎక్కడికైనా మార్చాలని డిమాండ్ చేశారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: