మనసుని వ్యతిరేక ధోరణితో నిర్భంధించుకోవద్ఢు
ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ. కరీం
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
మనసుని నిర్భంధించే వ్యతిరేక ఆలోచన ధోరణిని గుర్తించాలని, మనసు అదుపు తప్పకుండ ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ మనసు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలని, మనసు చేసే అల్లరికి బానిసలుగా మారకూడదని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శనివారం మహెదిపట్నం డిపోలో సిబ్బంది మరియు కార్మికులకు డిపో మేనేజర్ జి.వెంకటసూర్యనారాయణ నిర్వహణలో ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం ప్రధాన శిక్షకులుగా పాల్గొని మాట్లాడుతూ నిరంతరంగా మారుతున్న జీవన ప్రమాణాల ఆధారంగా ప్రతిరోజు ఎదురైయ్యె అనుభవాల ఆధారంగా ఏర్పడే ఆలోచనలను ఎప్పటికప్పుడు బలపర్చుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు మనసుపై నియంత్రణ కోల్పోవద్ఢని, ప్రతి సమస్యకు మూలం మనసే అని, మానసిక సామర్ధ్యం పెంచుకుంటే అది మనలో సర్వరోగనివారిణిలాగా పని చేస్తుందని అన్నారు. మానసిక నిర్వహణ అనేది సాఫల్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని,
మన ఆలోచనలే మనకు శత్రువులుగా మారకూడదని, మన జీవితం మన ఆలోచనలతోనే ముడి పడి ఉంటుందని, మంచి జీవనశైలి ప్రతి ఒక్కరికి చాల అవసరం అని ఆయన అన్నారు. అనంతరం వివిధ మానసిక సమస్యలతో బాధపడే వారికి వ్యక్తిగత కన్సల్టేషన్ మరియు మానసిక ప్రవర్తన లోపాలను సవరించుకునే విధి విధానాలను ప్రయోగ పూర్వకంగా అవగాహన కల్పించారు. వ్యక్తిగత మానసిక సమస్యల పరిష్కారం కోసం 9440488571 పై సంప్రదించాలని సైకాలజిస్ట్ డాక్టర్ కరీం కోరారు. అనంతరం సైకాలజిస్ట్ డాక్టర్ కరీం సేవలను అభినందిస్తూ ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మహెదిపట్నం ఆర్టీసి డిపో మేనేజర్ జి.వెంకటసూర్యనారాయణ ట్రాఫిక్ మేనేజర్ కరుణశ్రీ, అకౌంట్స్ మేనేజర్ స్వరూప రాణి, కార్యక్రమ నిర్వాహకులు ఆనంద్, కృష్ణ, జగన్నాధం, ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
మనసుని వ్యతిరేక ధోరణితో నిర్భంధించుకోవద్ఢు .... ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ. కరీం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: