ఆమ్లెట్ వేసిన హీరో రామ్ చరణ్


తన విహార యాత్రలో హీరో రామ్ చరణ్  ఆమ్లెట్ వేశారు. ఇదిలావుంటే రామ్ చరణ్ దంపతులు టాంజానియా అందాలను వీక్షించే పనిలో ఉన్నారు. జపాన్ లో పర్యటన ముగించుకుని వీరు టాంజానియా చేరుకున్నారు. టాంజానియాలో ఓపెన్ టాప్ జీప్ ను రామ్ చరణ్ నడుపుతుంటే, పక్కనే ఓ చిన్నారి కూర్చున్నాడు. ఆ తర్వాత బహిరంగ ప్రదేశంలోనే ఏర్పాటు చేసిన స్టవ్ పై చరణ్ ఆమ్లెట్ వేశాడు. ఇదంతా టాంజానియా సఫారీలో భాగమని తెలుస్తోంది. రామ్ చరణ్ కు సాయంగా కొందరు స్థానికులు వెంట ఉన్నారు. 

తాను జీప్ నడుపుతున్న వీడియో క్లిప్ ను రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం అని తెలుస్తోంది. ఎందుకంటే అదే జీప్ నుంచి కెమెరాతో సమీపంలోని సింహాన్ని ఫొటో తీయడాన్ని వీడియోలో చూడొచ్చు. తమ పర్యటనకు సంబంధించిన దృశ్యాలను ఉపాసన కూడా సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 21న విడుదలైంది. దీనికి ముందు అక్కడ సినిమా ప్రచారం కోసం రామ్ చరణ్ దంపతులు వెళ్లారు. అటు తర్వాత వీరు టాంజానియాలో పర్యటిస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: