న్యాయ రాజధానితోనే.... సీమకు పూర్వ వైభవం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పరిధిలోని  పాణ్యం లో మూడు రాజధానులకు మద్దతుగా పాణ్యంలో "రాయలసీమ ఆత్మగౌరవ"భారీ ర్యాలీ నిర్వహించారు. వివరాలలోకి వెళితే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తేనే రాయలసీమకు పూర్వవైభవం వస్తుందనీ , "మూడు రాజధానులు ముద్దు - ఒక రాజధాని వద్దు"అనే నినాదంతో రాయలసీమ విద్యార్థి , యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాణ్యంలో రాయలసీమ ఆత్మగౌరవ పేరుతో ర్యాలీ నిర్వహించారు.


స్ధానిక పాణ్యం బస్టాండు లోనీ నాలుగురోడ్ల కూడలిలో 1000 మంది  విద్యార్థిని, విద్యార్థులతో  మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులు కావాలని పెద్ద ఎత్తున  నినాదాలు చేశారు. ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు రవీంద్రనాధ్ , బత్తిని ప్రతాప్ , వేణు మాధవరెడ్డి , కేజే. శ్రీనివాసరావు , బాలకృష్ణా నాయక్ తదితరులు మాట్లాడుతూ తరతరాలుగా సీమకు జరుగుతున్న అన్యాయం ను  సహించేది లేదని , పరిపాలనా వికేంద్రీకరణ వలన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తుంటే , దీనిని కొంత మంది కుట్రపూరితమైన ఆలోచనలతో అడ్డుకుంటున్నారని, కేవలం అమరావతి ప్రాంతం మాత్రమే రాజధానిగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం అని,

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు సహకరించాలని లేదంటే సీమలో అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం మేధావులను, రాజకీయ నిపుణులను,అందరినీ కలుపుకొని పోరాటం మరింత ఉధృతం చేయనున్నట్లు విద్యార్థి జేఏసీ నేతలు తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: