అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడమే ఎంపీజే లక్ష్యం
ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
(జానో జాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడమే ఎంపీజే ముఖ్య ఉద్దేశమని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆది వారం ఖమ్మం ఎంపిజే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, దళిత, గిరిజన, బందు తరహాలోనే ముస్లిం బందును కూడా ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రత్యేకంగా ముస్లిం సబ్ ప్లాన్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిమ్ మాట్లాడుతూ ఎంపిజే లక్ష్యం సమాజ సంక్షేమం. శాంతి, న్యాయం నెలకొల్పడం, దేశం నుండి పేదరికం, అజ్ఞానం, మతవివక్ష, పరస్పర విద్వేషాలను పారద్రోలడం, మానవ హక్కులను కాపాడడం, మహిళా హక్కులను పరిరక్షించడం, పిల్లల మరియు బలహీన వర్గాలకు రాజ్యాంగ హక్కులు కల్పించడం తదితరమైనవి.
శాంతి, న్యాయం కోసం పోరాడుతూ రాజకీయేతర, ప్రభుత్వేతర సామాజిక సంస్థ. దేశంలో శాంతిని, న్యాయాన్ని పెంపొందించడం కోసం, కులమతాల కతీతంగా అన్ని వర్గాల నుండి సహాయం పొందుతుంది. అంతేగాక ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పధకాల సద్వినియోగం, ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు జరిపే విషయంలో ఎంపిజే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమావేశంలో ఎంపీజె రాష్ట్ర ఉపాధ్యక్షులు అహ్మద్ అబ్దుల్ నయీమ్, ప్రధాన కార్యదర్శి సలీమ్ అల్- హింది, కార్యదర్శి ఎం.ఏ. సత్తార్ షారూఖీ, కోశాధికారి అహ్మద్ హెచ్. షకీల్ లు అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ డాక్టర్ ఖలీఖుర్ రహ్మాన్, జహీర్, నాసర్ అహ్మద్, హకీమ్, సతీష్, రజబాలి, రఫీఖ్, జమీల్, అజీజ్, గఫార్, రాజారావు, చక్రవర్తి, నయీమ్, అస్రీన్, అబ్బాస్, జాని, షర్ఫుద్దీన్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడమే ఎంపీజే లక్ష్యం-- ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: