పార్టీ ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రజలకు చేర్చండి
దేశం సత్యనారాయణ రెడ్డి పిలుపు
(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)
పార్టీ ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు దేశం సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం టిడిపి పార్టీ ఇన్చార్జి మరియు మాజీ శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆదేశాల మేరకు, గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యం రెడ్డి ఆధ్వర్యంలో మండల ఐటీడీపి టీం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
ఐటిడిపి పనితీరు బాగుందని, ఇంకా బాగా పనిచేసి ప్రజల్లోకి మరింత ముందుకు దూసుకెళ్లాలని, పార్టీ ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు సూచించారు. ఐటిడిపి పాణ్యం నియోజకవర్గ అధికార ప్రతినిధి రాజు ఆర్మీ (Retd )మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండాలని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో కూడా ఐటిడిపి సభ్యులు పాల్గొనాలన్నారు.పార్టీని బలోపేతం చేసి,ఎన్నికలలో గెలవడానికి మన వంతు పాత్ర పోషించాలని, పార్టీ గెలవడానికి సోషల్ మీడియా ఒక పెద్ద ఆయుధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి సభ్యులు మతృ నాయక్, పరమేష్ నాయక్, బద్దు నాయక్, సోను బాబు, లోకేష్, నాగేశ్వరరావు, నవీన్ పాల్గొన్నారు.
Home
Unlabelled
పార్టీ ఇచ్చిన ప్రతి విషయాన్ని ప్రజలకు చేర్చండి దేశం సత్యనారాయణ రెడ్డి పిలుపు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: