సమయపాలన పాటించాలి
ఎంపీడీవో విజయసింహారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ గారి ఆదేశాల మేరకు గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయ నరసింహారెడ్డి గడివేముల మండల పరిధిలోని బిలకలగూడూరు, బూజునూరు గ్రామ సచివాలయాలను సందర్శించి సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేసి బయో మెట్రిక్ అటెండెన్స్ తనిఖీ నిర్వహించి, సచివాలయం నందు అందరు తప్పకుండా మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని, సచివాలయ సిబ్బంది అందరు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని, సచివాలయం సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. SWMP షేడ్ లను సందర్శించి గ్రీన్ అంబాసిడర్ సిబ్బంది కి సేంద్రియ ఎరువుల తయారీ విధానం పై,పలు అంశాలపై అవగాహన కల్పించి, ప్రతి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు కేటాయించిన ఇళ్ళ నుండి తడి మరియు పొడి చెత్త తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు.
Home
Unlabelled
సమయపాలన పాటించాలి-- ఎంపీడీవో విజయసింహారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: