స్మిమింగ్ ఫూల్ నిర్మాణంతో...వివాదంలోకి రిషి సునాక్


బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రచార పర్వంలో తీవ్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. రిషి సునాక్ ను అక్కడి ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. దీంతో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీపడుతున్నభారత సంతతికి చెందిన రిషి సునాక్ చుట్టూ వివాదాలు, విమర్శలు అలముకుంటున్నాయి. ఎన్నికలకు నెల రోజులు కూడా సమయం లేకపోగా.. సునాక్‌పై ప్రత్యర్థి లిజ్ ట్రస్ పైచేయి సాధిస్తున్నారు. ఇదే సమయంలో రిషి సునాక్‌ని ఇరకాటంలో పడేసేందుకు యూకే మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన జీవశైలి గురించి ప్రతీ అంశాన్ని బయటకు తెస్తూ వివాదాలకు ఆజ్యం పోస్తోంది. తాజాగా.. తన విలాస భవనంలో రిషి సునాక్ నిర్మిస్తున్న స్విమ్మింగ్‌పూల్‌‌పై దుమారం రేగుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా యూకేలో ఎండలు ఠారెత్తిస్తుండటంతో నదులు, నీటి వనరులు అడుగంటి తీవ్ర నీటిఎద్దడి నెలకుంది. ఈ క్రమంలో భారీస్థాయిలో స్మిమ్మింగ్‌పూల్ నిర్మించడం ఏంటని మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

డెయిలీ మెయిల్ కథనం ప్రకారం.. నార్త్‌ యార్క్‌షైర్‌లో సునాక్‌కు ఓ విలాసవంతమైన భవంతి ఉ:ది. వీకెండ్‌లలో భార్య అక్షత మూర్తి, పిల్లలతో కలిసి సునాక్ అక్కడికి వెళ్తుంటారు. అయితే ఏరియల్‌ ఫుటేజీల ద్వారా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను హైలెట్ చేస్తూ కథనం ప్రచురించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ తెగ వైరల్‌ అవుతున్నాయి. నీటి కొరతతో ఆ నగరంలో స్విమ్మింగ్‌ పూల్స్‌ను అధికారులు బలవంతంగా మూసేసిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నాయి.

నీటి కొరత ఉన్న సమయంలో 400,000 పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.8 కోట్లు) ఖర్చుతో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం చేపట్టడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, రిషి సునాక్, ఆయన కుటుంబం విలాసవంతమైన జీవనశైలి గురించి విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో సునాక్ భార్య అక్షితామూర్తి అత్యంత ఖరీదైన టీకప్పులో టీ తాగుతున్న ఫోటోపై దుమారం రేగింది. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారీగా పన్నులు విధించడంతో సునాక్ విమర్శలను ఎదుర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: