తెలుగు...వ్యాయామ ఉపాధ్యాయులకు... ఘన సన్మానం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష దినోత్సవం గురించి మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అని ఎందరో మహానుభావులను చిరకాలం తెలుగు భాష గుర్తు ఉండే విధంగా తెలుగు భాష సంస్కృతిని, మేధా శక్తి ని దేశ దేశాలకు చాటి చెప్పారని విశ్వ గుండం విశ్వేశ్వరయ్య,అష్టదిగ్గజ కవులను,శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ శ్రీ, గిడుగు రామ్మూర్తి పంతులు వంటి మహానుభావుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.


జాతీయ క్రీడ దినోత్సవం గురించి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ ఆధ్వర్యంలో ఒలంపిక్స్  హాకీ లో వరుసగా ప్రపంచ కప్పులు అందించారని అతనిని భారతీయులు ఎవరు మర్చిపోలేరని, ధ్యాన్ చంద్  భారతదేశానికి గర్వకారమని ధ్యాన్ చంద్  పుట్టినరోజు దినోత్సవం భారతీయులం అందరం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.అనంతరం తెలుగు  ఉపాధ్యాయులను, వ్యాయామ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుకన్య, మహబూబ్ బాషా, రాములు, రవి, లక్ష్మయ్య, రామాంజనేయులు, సూర్య ప్రకాష్ రెడ్డి, పుల్లయ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: