పర్యావరణాన్ని పరిరక్షించండి


మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి.. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన ప్రజలను కోరారు. గణేష్ ఉత్సవాలపై బుద్ధ భవన్‌లో జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోందని వివరించారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు. గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్ కాకుండా నిమజ్జనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: