రగులుతున్న కుప్పం...టీడీపీ వర్సెస్ వైసీపీ

చిత్తూరుజిల్లాలోని కుప్పం నియోజకవర్గం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రగులుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో మరోసారి అన్న క్యాంటీన్ ధ్వంసం కలకలంరేపింది. సోమవారం రాత్రి 11 గంటలకు దాడి చేసి అక్కడ ఏర్పాట్లు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గతవారమే చంద్రబాబు పర్యటన జరుగుతున్న క్రమంలో అన్న క్యాంటిన్‌ను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ క్యాంటిన్ ధ్వంసం చేయడం కలకలంరేపుతోంది.

అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర 86 రోజులులగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందని.. అర్థరాత్రి దాడిని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని.. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని.. అన్నక్యాంటీన్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం లోకేష్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి చిత్తూరు సబ్ జైలుకి వెళతారు. అక్కడ కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంలో అరెస్టైన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను లోకేష్ పరామర్శిస్తారు.

అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీడీపీ నాయకులు భాస్కర్, భాను ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత పెరుమాలపల్లెలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాధ్ రెడ్డిని పరామర్శిస్తారు. ఇదే సమయంలో కుప్పం అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: