చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదు
ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య
(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)
ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, ఆ సాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య స్పష్టంచేశారు. ఇదిలావుంటే నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామం ఊరి బయట శ్రీ దుర్గా భోగేశ్వరం వెళ్ళు రహదారిలో ఉన్న ఖాళీ ప్రదేశంలో రుద్రవరం మరియు గడివేముల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మూగజీవాలైన రెండు వరాహలతో (పందులతో) వాటి మధ్య డబ్బులను పందెం గా పెట్టీ పోటీలు నిర్వహిస్తున్నారని సమాచారం తెలుసుకున్న గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య వెంటనే తన సహచర పోలీస్ సిబ్బందితో అప్రమత్తమై వెళ్లి 20 మంది వ్యక్తులను,
17 మోటర్ సైకిలను ,2 ఆటోలను ,2 వరాహాలను(పందులను),9800/- రూపాయల ను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడివేముల మండలంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు, ఆ సాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసు శాఖ మరియు పోలీసు సిబ్బంది కఠినచర్యలు తీసుకుంటామని గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య హెచ్చరించారు.
Home
Unlabelled
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదు- ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: