ఆ సమయంలోపు ఏపీ బకాయిలు చెల్లించండి


ఏపీ విద్యుత్ సంస్థలకు బాకీపడిన రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణకు కేంద్రం డెడ్‌లైన్ పెట్టింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆదేశాల మేరకు.. తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకూ తెలంగాణకు అందించిన ఈ విద్యుత్తు బకాయిలు చెల్లించలేదు.

గతంలో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని కోరింది. వారం క్రితంఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో సమావేశంలో ప్రస్తావించారు. అలాగే గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేంద్రం.. రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశించింది.

ఏపీ జెన్‌కో సరఫరా చేసిన 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు.. తెలంగాణ డిస్కమ్‌లు రూ.3,441.78 కోట్లు చెల్లించాలి. ఈ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లను ఏపీకి చెల్లించాలి. ఎన్నో సందర్భాల్లో ఈ బకాయిల్ని చెల్లించాలని కోరినా తెలంగాణ మాత్రం ఇవ్వలేదు.

విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఎన్న సందర్భాల్లో కోరింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్వహించిన ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శుల సమావేశంలోనూఏపీ అధికారులు బకాయిల అంశాన్ని ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్రం కూడా సూచించింది. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ చర్చలు సఫలం కాలేదు.. అలాగే తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటోంది తెలంగాణ. ముఖ్యమంత్రి జగన్ పట్టుబట్టి ప్రధాని మోదీకి సమస్యను వివరించారు. ఇప్పుడు ఆ బకాయిల్ని చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: