గడివేముల మండలంలో...దొంగల హల్చల్

మాయమవుతున్న రైతుల మోటర్లు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండలంలో దొంగలు హాల్ చల్ చేస్తున్నారు. దీంతో తమ పోలాలను తడిపేందుకు ఏర్పాటుచేసుకొన్న నీటి మోటర్లు మాయం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం బూజునూరు గ్రామంలో కుందునది  నీరు పొలాలకు తరలించేందుకోసం రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకొన్నారు. వీటిలో మూడు మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు(దొంగలు) అపహరించారు. ఈ ఘటనను మరువక ముందే పోలీసులకు సవాలు విసురుతూ దొంగలు మరిన్ని నీటి మోటార్లను దొంగలించారు. ఆళ్లగడ్డ, గడివేములకు చెందిన రైతుల  10 మోటార్లు దొంగలించారు.


కుందూనది లోని నీటిని వాడుకునే రైతుల మూడు మోటర్లు విప్పి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా కుందు నదిలో మట్టి ఎక్కువగా ఉండడంతో వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అన్నదాతలు పంటలకు పండించే నీరు పెట్టుకునే మోటర్లు ఎత్తుకెళ్లడంతో అన్నదాతలు కన్నీరు అవుతున్నారు. గతంలో కూడా గడివేముల మండలంలో రైతులకు సంబంధించిన  మోటర్ల కరెంటు వైర్లను, మోటార్లను, ద్విచక్ర వాహనాలను, ఇంటి ఆవరణలో కట్టేసుకున్న  పొట్టేళ్లు, గడివేముల మండలంలో చోరీకి గురయ్యాయి. పోలీసుల గస్తీ సరిగా తిరగడం లేదని రైతులు, గ్రామప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు స్పందించి రాత్రిపూట గస్తిని పెంచి ఆగంతకులు దొంగతనాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని గడివేముల మండలంలోని రైతులు, గ్రామప్రజలు కోరుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: