సచివాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన.... 

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ నాగమద్దమ్మ ఎంపీడీవో విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖ అధికారులతో మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామంలో కరువు పనులు జరగడం లేదని, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, గ్రామాలలోని సమస్యలను, ఉండుట్ల గ్రామంలో 2005లో స్కూలు కట్టుకునేందుకు అనుమతిచ్చారని  అందులో అంగన్వాడి సెంటర్ కూడా ఉందని కానీ కొందరు ఇది మా స్థలం 2008 లో మాకు డీకెట్ పట్టా ఉందని ఇటువైపు  తిరగరాదని అంటున్నారనే సమస్యను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కరువు పనులను ఏ కారణం చేత నిలిపివేశారని, తప్పనిసరిగా మండలంలోనీ ప్రతి గ్రామంలో కరువు పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, సచివాలయం సిబ్బంది గ్రామాలలోని ప్రజలందరికీ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని మొక్కుబడిగా ఉద్యోగాలు చేయరాదని, సరియైన వేలకు విధులకు రావాలని వీకేసి వేసి ప్రజలకు అందుబాటులో లేకుండా బయట సొంత పనులకు వెళ్లే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని, నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1,80,000 రూపాయలను పొదుపు గ్రూపులలో ఉన్న వారికి 2,15,000 రూపాయలను వారు ఇల్లు కట్టుకునే స్థాయిని బట్టి వారికి డబ్బులు అందజేయడం జరుగుతుందని,

గ్రామాలలో అత్యవసర పనులకు నిమిత్తం 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, బిలకల గూడూరు గ్రామంలో పొలాలు పోయి పరిహారం రానీ నిజమైన రైతన్నలను తాసిల్దార్ గారిచే సర్వే జరిపించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సొసైటీ అధ్యక్షులు ఆర్.బి శేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: