గడివేముల మండలంలో కొత్తగా...
283 మందికి పింఛన్లు మంజూరు
గడివేముల మండల అభివృద్ధి అధికారి.... విజయసింహారెడ్డి(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా, గడివేముల మండలంలో ఉండే 14 గ్రామాలలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 283 లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేశారని గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్తే గడివేముల ఒకటి 17, గడివేముల రెండు 26, బిలకల గూడూరు గ్రామంలో 21, బూజునూరు గ్రామంలో 14, చిందుకూరు 25, దుర్వేసి 6, గడిగరేవుల 29, గని 35, కరిమద్దెల 15, కొరట మద్ది 15, కొర్రపోలురు 17, మంచాల కట్ట 17, ఉండుట్ల 21, పెసర వాయి 25, మంది లబ్ధిదారులకు కొత్తగా పింఛన్లు మంజూరు అయ్యాయని వాటిని ఆగస్టు 1వ తేదిన ఆయా గ్రామాల్లోని సర్పంచ్ లు, ప్రజా ప్రతినిదుల చే పంపిణీ చేయించామని గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహా రెడ్డి తెలిపారు.
Home
Unlabelled
గడివేముల మండలంలో కొత్తగా... 283 మందికి పింఛన్లు మంజూరు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: