దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో,,,

అతిపెద్ద డాటా సైన్స్‌ ఫ్యాకల్టీగా నిలిచిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

“ భారతదేశంలో అగ్రగామి డాటా సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌ కావడంతో పాటుగా ఎడ్‌టెక్‌ అగ్రగామి అప్‌గ్రాడ్‌కు 100% అనుబంధ సంస్ధ అయిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ (ఠఞఎట్చఛీ ఐూఖిౖఊఉ) ఇప్పుడు ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఎడ్‌టెక్‌ సంస్ధగా డాటా సైన్స్‌ మరియు ఏఐ డిపార్ట్‌మెంట్‌లలో పూర్తిగా అంకితం చేయబడిన ఫ్యాకల్టీతో నిలిచింది.

పూర్తిగా అంకితం చేయబడిన 40కు పైగా మెషీన్‌ లెర్నింగ్‌ సైంటిస్ట్‌లతో పాటుగా 80కు పైగా ఫ్యాకల్టీ సభ్యులను సంస్థ కలిగి ఉంది. డాటా సైన్స్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ మరియు మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాలలో అపారమైన అనుభవం వీరికి ఉంది.

‘‘ఈ అత్యాధునిక సాంకేతికతలలో శిక్షణను అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీలతో పాటుగా దశాబ్దాల  అంతర్జాతీయ పరిశ్రమ, ఆర్‌ అండ్‌ డీ అనుభవం, అంకిత భావం కలిగిన అధ్యాపకులను పెద్ద సంఖ్యలో కలిగి ఉండటం అవసరం. శక్తివంతమైన అంతర్గత నైపుణ్యంతో పాటుగా, పరిశ్రమ, అకాడెమియా, ఆర్‌ అండ్‌  డీ, వ్యవస్ధాపకత మరియు ఉత్పత్తి పరిజ్ఞానాన్ని మా కరిక్యులమ్‌, బోధనా  విధానంలో జోడించడానికి, అభ్యాసకులకు పూర్తి అంకితభావంతో మద్దతునందించడానికి ఇది మాకు సహాయపడుతుంది’’ అని అప్‌గ్రాడ్‌ ఇన్సోఫీ అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటష్‌ సుంకడ్‌ అన్నారు.


‘‘నేడు అందుబాటులో ఉన్న చాలా సాంకేతికతలు సంప్రదాయ పాఠ్యపుస్తకాలలో  భాగం కాదు. అందువల్ల, బల్క్‌ డాటాను విశ్లేషించడానికి మరియు వ్యాపార నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అప్లయ్డ్‌ సైన్స్‌ను ఉపయోగించడానికి శిక్షణ పొందిన నిపుణుల అంతరం వేగంగా పెరుగుతుంది. అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ స్థిరంగా తమ ఫ్యాకల్టీని  డాటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌ విభాగాలలో విస్తరిస్తోంది. వీరు అభ్యాసకులకు అత్యంత క్లిష్టమైన కోడింగ్‌, డాటా ఛాలెంజస్‌లో ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ల ద్వారా సహాయపడుతున్నారు’’ అని డాక్టర్‌ దక్షిణామూర్తి వి కొల్లూరు, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో– అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ అన్నారు.

‘‘అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ ద్వారా మేము విస్తృత స్ధాయిలో మా అభ్యాసకులకు స్పెషలైజేషన్స్‌ను తీసుకురావడంతో పాటుగా వారి డొమైన్‌ ఫౌండేషన్‌ బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతున్నాము. ఏఐ, ఎంఎల్‌, డాటా సైన్స్‌లో ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు సంబంధించిన నేపథ్యాలను నేవిగేట్‌ చేయడంలో  నిపుణులకు సహాయం చేయడానికి నాణ్యమైన ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ బోధనా విధానాన్ని మెరుగుపరిచే విద్యావేత్తలతో  త్వరలోనే మేము అంతర్జాతీయంగా అగ్రగామి కాగలము’’అని  అప్‌గ్రాడ్‌ కో–ఫౌండర్‌ అండ్‌ ఎండీ మయాంక్‌ కుమార్‌ అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: