నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి చేయూత

(జానో జాగో వెబ్ న్యూస్-అనంతపురం ప్రతినిధి)

మతం ఏదైనా మానవత్వమే మిన్న అంటూ అనంతపురం జిల్లాలో పలు సామాజికే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పేదలకు ఆర్థికంగా అండగా నిలవడం వారి నైజం. అనంతపురం జిల్లాకు చెందిన మానవహక్కుల నేత ఎన్.జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్త షేక్ నిజాం వీరిద్దరు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. తాజాగా వీరు అనంతపురంలోని శుక్రవారంనాడు కళ్యాణ్ దుర్గం రోడ్డు పాపంపేట కు సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం రూ.8వేల సహాయం అందేలా చేశారు. పెళ్లి కూతురు తండ్రి ఒక సామాన్య నిరుపేద తోపుడు బండిలో కూరగాయలు  వ్యాపారం చేసుకునే నిరుపేద యూనుస్ సహాయం కోరగా వారు మానవతా దృక్పథంతో వారు సహాయం అందేలా చేశారు. అనంతపురం మాసుమాబి-సారాబి దర్గా లో  మహాల్ దార్ బంగారు షాపుల యునియన్ల రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా చేతుల మీదుగా పెళ్లి ఖర్చులకు గాను రూ.8వేల సహాయం చేసి వితరణచాటుకొన్నారు. ఈ కార్యక్రమంలో హాజీ ఇక్బాల్, ప్రజాబలం జాకీర్. ఎస్ఎంఎస్ గౌస్. జీలాన్. దర్గా ముజావర్ పాల్గన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: