ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కూతురు వివాహం

హాజరైన ప్రముఖులు

కుటుంబ సమేతంగా హాజరై...వధు, వరులను ఆశీర్వదించిన వైసీపీ మైనార్టీ నాయకులు మోహిద్దీన్

(జానో జాగో వెబ్ న్యూస్-కడప ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్ బాషా కూతురు వివాహం ఘనంగా జరిగింది. కడప పట్టణంలోని మధవీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహానికి వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తదితరలు హాజరయ్యారు. ఈ వివాహవేడుకకు ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ మోహిద్దీన్ కుటుంభ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వధు, వరులను ఆశీర్వాదించారు.


నిండునూరేళ్లు ఈ జంట ప్రేమ, ఆప్యాయతలతో మెలగాలని వారు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్ బాషాను ఈ సందర్భంగా సయ్యద్ మోహిద్దీన్ కలసి ప్రత్యేక  శుభాకాంక్షలు తెలియజేశారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: