తెలంగాణలో మళ్ళీ అలా...

కంటైన్​మెంట్​ జోన్లు ఏర్పాటు

భయాందోళనల్లో ప్రజలు

వెంటాడుతున్న లాక్ డౌన్ భయాలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఓమిక్రాన్ రాకతో  మళ్లీ హైదరాబాద్ నగర వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మళ్లీ లాక్ డాన్ పరిస్థితులు వస్తాయా అన్న ఆందోళనలు వారిలో కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ మళ్లీ వస్తే అన్ని విధాలా నష్టపోతామని, రెండేళ్ల కాలంలో తమ ఉపాధిపై కరోనా కారణంగా పెద్ద దెబ్బ పడిందని వారు పాత అనుభవాలను నెమరవేసుకొంటున్నారు.


ఇదిలావుంటే హైదరాబాద్ నగరంలో మళ్లీ కంటైన్​మెంట్​ జోన్లు షురూ అయ్యాయి. ఒమిక్రాన్​కేసులు తేలిన నేపథ్యంలో హైదరాబాద్​లోని టోలీచౌక్​ మొత్తం ఒకే క్లస్టర్​గా నిర్బంధం చేశారు.కేసులు నమోదైన పారమౌంట్​ కాలనీని పోలీసులు, వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసి జీనోమ్​ సీక్వెన్సింగ్​కు కూడా శాంపిల్స్​ పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే ఇక నుంచి విదేశాల నుంచి వచ్చినోళ్లలో ఒక్కరికి పాజిటివ్​ తేలినా, ఆ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్​ చేసి టెస్టులు చేయనున్నారు.

మొదటి, రెండో వేవ్​ లో చేసినట్లే ఈ ప్రక్రియ ఉండనుంది. ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీట్మెంట్​ విధానం మళ్లీ అమల్లోకి రానుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో కేసులు పెరిగినా క్లస్టర్లుగా విభజించిన సదరు కాలనీల్లో ప్రతి రోజు హైపోక్లోరైట్​ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నారు. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది , మున్సిపల్​, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్​సిబ్బందిలు ఆ ఏరియాను పర్యవేక్షణ చేయనున్నారు. కంటైన్​మెంట్​ లో ఉన్న వ్యక్తి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. అవసరమైన నిత్యావసర, అత్యవసర వస్తువులను జీహెచ్ఎంసీ సిబ్బంది అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 8 వారాల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యశాఖ నొక్కి చెప్పింది.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

           




ఏం లాభం..?

కంటైన్​మెంట్​లు విధించడం వలన వైరస్​ వ్యాప్తిని కంట్రోల్​ చేయొచ్చు. వైరస్​ చైన్​ లింక్​ ను తొలగించే ప్రక్రియనే ఈ క్లస్టర్​విధానం . ఈ పరిధిలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని కలిసే అవకాశం లేనందున వైరస్​కేవలం కంటైన్​మెంట్​కే పరిమితం అవుతుంది. ఇంక్యూబేషన్​ పీరియడ్​ తర్వాత పూర్తిస్థాయి అదుపులోకి వస్తుంది. తద్వారా కేసుల తీవ్రతను సులువుగా అడ్డుకోవచ్చని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటి, రెండో వేవ్​లలో వైరస్​ వ్యాప్తిని ఈ విధానంతోనే అడ్డుకున్నట్లు అధికారులు చెప్పారు. అసలు దేశవ్యాప్తంగా కంటైన్​మెంట్​ ప్రక్రియను మన రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మొదటి వేవ్​ సమయంలో మర్కజ్​ వ్యక్తులను గాలింపు చర్యల్లో కరీంనగర్​లో మొదటి సారి కంటైన్​మెంట్​ చేశారు. ఆ తర్వాత కేసులు ఎక్కువగా ఉన్న ప్రతి ప్రాంతంలో ఈ ప్రక్రియను తీసుకువచ్చారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: