గుప్తా నిధుల కోసం తవ్వకాలు

రంగంలోకి దిగిన పోలీసులు... పలువురి అరెస్టు

(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

     ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని పోతుల పాడు గ్రామం లోని చెరువు కింద ఉన్న పురాతన రాతి తూము కింద గుప్త నిధులు ఉన్నాయని 9 మంది నిన్న రాత్రి తవ్వకాలు చేశారు. కొంతమంది రైతులు రాత్రిపూట పొలాల్లో కి వెళ్లిన రైతులు  చెరువు దగ్గర శబ్దాలు వస్తుండడం గమనించి రైతులు వెంటనే గ్రామంలోని కొంతమందికి చెప్పడంతో గ్రామ ప్రజలు అక్కడికి వెళ్లి చూడగా తవ్వకాలు చేస్తున్నట్లు గమనించారు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని అడిగిన వెంటనే 


 9 మంది పారిపోవడంతో కొంతమంది రైతులు వెంబడించి  7 మందిని పట్టుకోగా మిగతా ఇద్దరూ పరారిఅయ్యారు. పట్టుకున్న వాళ్లనువెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు  7 మంది నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నట్లు పొదిలి సిఐ సుధాకర్ బాబు మరియు టీవీ పల్లి ఎస్సై సువర్ణ తెలియజేశారు.



             

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: