రిలీవ్ అయిన ఉద్యోగులకు ఊరాట
వారి జీతాలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశం
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ లీగల్ బ్యూరో)
ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ఆంధ్రా నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన 12 మంది ఉద్యోగుల పెండింగ్ జీతాలు మూడు వారాల్లోపు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్వీసు బ్రేక్ లేకుండా క్రమబద్ధీకరించాలని సూచించింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో అభ్యర్థికి రూ.10 వేలు చొప్పున చెల్లించాలని సూచించింది. కోర్టుకు రాని మిగిలిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని ఆ దేశించింది. ఇదిలావుంటే సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ జీతాలపై ఉద్యోగులు కొందరు సుప్రీంను ఆశ్రయించారు. రిలీవ్ అయిన ఉద్యోగుల తరఫున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. దీంతో సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
Home
Unlabelled
రిలీవ్ అయిన ఉద్యోగులకు ఊరాట,,, వారి జీతాలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: