జిల్లా జడ్జి నివాస భవనానికి శంకుస్థాపన చేసిన...
డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ షేక్ మహమ్మద్ ఫజులుల్లా
(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆదివారంనాడు ఉదయం 8.45 గంటలకు కోర్టు ఆవరణంలో ఆరవ అదనపు జిల్లా జడ్జి వారి నివాస భవనానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ షేక్ మహమ్మద్ ఫజులుల్లా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థన (పట్టణ మర్కస్ మస్జీద్ షాహి ఇమామ్ సాదిఖ్ మౌలానసాహెబ్, ఓరుగంటి సుబ్రమణ్యం, పాస్టర్)లతో నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో జూనియర్ సివిల్ జడ్జి వి. ఆది నారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కే. వి. నారాయణ రెడ్డి, లక్కాకుల లక్ష్మి నారాయణ, షేక్ యూసుఫ్ ఆలి, గెల్లి చౌడేశ్వర రావు, సామాజిక సంఘ సంస్కర్త, ప్రముఖ సివిల్, క్రిమినల్ న్యాయవాది జావీద్ అన్వర్, న్యాయవాది షేక్ మహబూబ్ వలి, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: