హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో....
ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
(జానో -జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని వెంగముక్క పాలెం నందు ఉన్న చేర్చి ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా పాల్గొని కేకు కట్ చేసి పిల్లలతో కలసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరా సోదరీ లకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కళ్యాణకోసం దేవుని కుమారుడైన యేసు ప్రభువు మానవులను సన్మార్గంలో నడిపించుటకోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు అని ఆయన మనమందరి దేవుడని
ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం మన అదృష్టం గా భవించాలని అన్నారు.అనంతరం చర్చి నిర్మాణానికి సంబంధించి 50 బస్తాలు సిమింట్ ఇస్తూ పేద వృద్ధమహిళలకు దుప్పట్లు, షాల్వలు పంచారు.ఈ కార్యక్రమంలో ఈ చర్చి ఫాదర్ నత్తనీయల్, స్థానిక నాయకులు చుండి శ్యామ్, తేళ్ల అరుణ్,అతoట్టి ఇర్నియా,డాక్టర్. ఏల్చురి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: