ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పేపర్లకే పరిమితం
నారా చంద్రబాబు నాయుడు
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో సహా మరో ముగ్గురు ఏబీఎన్ సిబ్బందిపై అక్రమంగా జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయటం వైసీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమం గాలికొదిలి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. దాదాపు 30 గంటల తర్వాత జీరో ఎప్.ఐ.ఆర్ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, వైసీపీ నేతల అవినీతిని ఏబీఎన్ సంస్ధలు ఎప్పటికప్పుడు వెలికితీసి ప్రజలకు తెలియజేస్తున్నారన్న కారణంతో జగన్ రెడ్డి కక్షసాధిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు సంకెళ్లు ఎన్నాళ్లు వేస్తారు? వేమూరి రాధాకృష్ణ ఏం నేరం చేశారని ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తన మిత్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ నివాసంపై సోదాలకు వెళితే అక్కడికి రావడం రాధాకృష్ణ చేసిన తప్పా? లక్షీనారాయణతో సీఐడీ అధికారుల సమక్షంలోనే రాధాకృష్ణ మాట్లాడినా ఎందుకు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు? తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టారు. వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ సీఐడి అధికారులు, సంస్ధ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని మంటగలుపుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా రెండున్నరేళ్లుగా మీడియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరిగినా ఈ ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? 2430 జీవో తెచ్చి మీడియా గొంతు నొక్కారు. ఇలాంటి అణిచివేత ధోరణి, కక్ష సాధింపుచర్యల వల్ల జగన్ రెడ్డి ఎంతటి నియంతో అర్థమవుతోంది. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ప్రజాక్షేత్రంలో మీ తప్పులకు శిక్ష తప్పదు.;; అని ఆయన పేర్కొన్నారు.
Home
Unlabelled
ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పేపర్లకే పరిమితం-- నారా చంద్రబాబు నాయుడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: